Monday, April 29, 2024

HYD: ఔట్ సోర్సింగ్ కార్మికుల నిరసనకు టీడీపీ సంఘీభావం

ఉప్పల్ మున్సిపల్ ఔట్ సోర్సింగ్ కార్మికుల గత ఐదు రోజుల నుంచి తమను పర్మనెంట్ చేయాలని ఉప్పల్ మున్సిపల్ కార్యాలయంలో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. మంగళవారం చేపట్టిన ధర్నాలో తెలుగుదేశం పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ అధ్యక్షులు కందికంటి అశోక్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు వారికి సంఘీభావం తెలిపారు.

మద్దతు తెలిపిన వారిలో నాయకులు తిక్క ప్రకాష్, కల్లూరి వేణు, శేఖర్ రెడ్డి, డాక్టర్ అశోక్, మౌలాలి, హేమంత్ గౌడ్, గిరిబాబు, బిక్షపతి, కెపి శివ, ఇమామ్ సాబ్, రమేష్, లక్ష్మి వినోషమ్మ పాల్గొని సంఘీభావం తెలియజేస్తూ వారి న్యాయమైన కోరికలు తీర్చే వరకు తెలుగుదేశం పార్టీ వారికి అండగా ఉంటుందని తెలియజేయడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement