Wednesday, May 1, 2024

బాల్కొండ‌లో మంత్రి ప్ర‌శాంత్ రెడ్డికి గ‌జ‌మాల‌తో స్వాగ‌తం

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వేముల ప్రశాంత్ రెడ్డి ని ప్రకటించిన అనంత‌రం బాల్కొండ‌కు చేరుకున్న ఆయ‌న‌కు అభిమానులు గ‌జ‌మాల‌తో స్వాగ‌తం ప‌లికారు.. పెర్కిట్ పై ఓవర్ బ్రిడ్జి నుండి వేల్పూర్ ఎక్స్ రోడ్ వ‌ర‌కు వెళ్లి అక్క‌డ ఉన్న తండ్రి స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మంత్రి .

అక్కడి నుండి వేల్పూర్ భీంగల్ కమ్మర్ప పల్లి మోర్తాడ్ వరకు పెద్ద ఎత్తున బిఆర్ఎస్ శ్రేణులు నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వ‌హించారు.. ఈ సంద‌ర్భంగా ప్ర‌శాంత్ రెడ్డి ముఖ్య‌మంత్రి కెసిఆర్ కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement