Thursday, May 2, 2024

HYD: బీసీ విద్యార్థులకు ఫీజులు చెల్లింపు హర్షణీయం.. రాజేశ్వర్ యాదవ్

కర్మన్ ఘాట్, ఆగస్టు 22 (ప్రభ న్యూస్) : బీసీ విద్యార్థులకు యూనివర్సిటీలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఫీజు చెల్లించడంతో పాటు లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందచేస్తున్నందుకు రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు రాజేశ్వర్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

మంత్రి శ్రీనివాస్ యాదవ్ ను ఆయన కలిసి పుష్పగుచ్చమిచ్చి కృతజ్ఞతలు తెలిపినట్లు తెలిపారు. ప్రత్యేకంగా సనత్ నగర్ నియోజకవర్గం టికెట్ వచ్చినందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జగన్ చారి, రవికుమార్, జగదీష్ గౌడ్, సాయి వర్ధన్, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement