Sunday, May 5, 2024

HYD: అత్యాధునిక సీడ్ హెల్త్ ల్యాబ్‌ను ప్రారంభించిన సిన్జెంటా వెజిటబుల్ సీడ్స్

హైదరాబాద్: సిన్జెంటా వెజిటబుల్ సీడ్స్ హైదరాబాద్‌లో తమ సరికొత్త సీడ్ హెల్త్ ల్యాబ్‌ను ప్రారంభించింది. తద్వారా నాణ్యత నియంత్రణ సామర్థ్యాలలో కంపెనీ నిరంతర పెట్టుబడిని మరింత బలోపేతం చేసింది. ఈ అత్యాధునిక ల్యాబ్ ప్రపంచంలోనే అత్యంత అధునాతన విత్తన పరీక్షా సౌకర్యాలలో ఒకటి, భారతదేశం మొట్టమొదటి అంకితమైన విత్తన ఆరోగ్య ల్యాబ్‌ను అందిస్తుంది. ఇది భారతదేశంతో పాటుగా ఆసియా పసిఫిక్, వెలుపల సాగుదారులకు సేవలు అందిస్తుంది.

ఈసంద‌ర్భంగా సిన్జెంటా వెజిటబుల్ సీడ్స్ – ఆసియా పసిఫిక్ హెడ్ నిశ్చింత్ భాటియా మాట్లాడుతూ… అధిక-నాణ్యత, ఆరోగ్యవంతమైన విత్తనం, త‌మ వినియోగదారులకు ఈ రంగంలో విజయానికి పునాది అని అన్నారు. ఈ పెట్టుబడి పెంపకందారులకు ఆరోగ్యకరమైన, వ్యాధి-రహిత విత్తనాన్ని నమ్మదగిన సరఫరాను అందించాలనే త‌మ నిబద్ధతను వెల్లడి చేస్తుందన్నారు. ఈ ప్రపంచ స్థాయి సదుపాయం మేక్ ఇన్ ఇండియా, వ్యవసాయ రంగంలో భారతదేశం పెరుగుతున్న నాయకత్వ పాత్రకు మద్దతు ఇస్తూ, ప్రపంచ విత్తన ఎగుమతిదారుగా మారాలనే లక్ష్య సాకారానికి తోడ్పాటు అందిస్తుందన్నారు.

సిన్జెంటా వెజిటబుల్ సీడ్స్ అండ్ ఫ్లవర్స్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ గ్లోబల్ హెడ్ ఎరిక్ పోస్ట్మా మాట్లాడుతూ… గ్లోబల్ సీడ్ స్టీవార్డ్‌షిప్, విత్తన రంగంలో విత్తన ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం, సాగుదారుల పంటల సమగ్రతను కాపాడటం, ప్రపంచ సరఫరా గొలుసులను, ప్రపంచ ఆహార భద్రతను కాపాడటంలో కీలకమ‌న్నారు. నూతనకల్‌లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ కీలక అధికారులు పాల్గొన్నారు. ఎం రఘునందన్ రావు (IAS), వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్ అండ్ తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి, డాక్టర్ బి గోపి (IAS), డైరెక్టర్ అగ్రికల్చర్, తెలంగాణ ప్రభుత్వం, భారత ప్రభుత్వ వ్యవసాయ అండ్ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ డిప్యూటీ కమిషనర్ (క్యూసీ) డాక్టర్ డి కె శ్రీవాస్తవ తదితరులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement