Sunday, April 28, 2024

Rajasingh: శ్రీరామ‌న‌వ‌మి రోజున శోభ‌యాత్ర నిర్వ‌హిస్తే అంతే సంగ‌తులు….రాజాసింగ్‌కు బెదిరింపు కాల్స్

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు కాల్స్ మ‌రోసారి రావడం కలకలం రేపుతోంది. రామనవమి రోజున శోభయాత్ర తీస్తే చంపేస్తామని కొందరు ఫోన్‌లు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని స్వయంగా రాజాసింగ్ వెల్లడించారు. ఈ మేర‌కు ఆయ‌న నేడు ఒక వీడియోను విడుద‌ల చేశారు.

అందులో ఫోన్‌లు చేసి బెదిరించడం కాదని.. దమ్ముంటే నేరుగా రావాలని రాజాసింగ్ చాలెంజ్ చేశారు. గతంలోనూ ఇదే తరహాలో బెదిరింపు కాల్స్ వచ్చాయని తెలిపారు. నమ్మిన సిద్ధాంతం కోసం తాను ఎంతదూరమైనా వెళ్తానని చెప్పారు. ఇలాంటి బెదిరింపులు తనను ఏం చేయలేవని అన్నారు. బెదిరింపులకు పాల్పడే వారు ఎంత స్థాయి వ్యక్తులైనా తనకు అనవసరమని అన్నారు. దమ్ముంటే నేరుగా రావాలని.. లేకుంటే ఫోన్‌లు చేయడం మానుకోవాలని తేల్చి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement