Friday, May 3, 2024

HYD: ఎల్బీనగర్‌లో రోడ్డు ప్ర‌మాదం..ఒకరు దుర్మరణం

నాగోల్, డిసెంబర్ 17(ఫ్రభ న్యూస్) బ‌తుకు దెరువు కు నగరానికి వచ్చిన ఓ ఎలక్ట్రీషన్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధి చింతలకుంట చెక్ పోస్ట్ సమీపంలో జరిగింది. ఎస్ఐ దయాకర్ రెడ్డి కథనం ప్రకారం శనివారం అర్థ‌రాత్రి ఏపీ 27బీపి3333 నెంబర్ గల బియండబ్ల్యు కారు హయత్ నగర్ నుంచి ఎల్బీనగర్ వైపు అతివేగంగా వచ్చి బీభత్సం సృష్టించింది.

అతివేగంగా దూసుకొచ్చిన కారు ఒక్కసారిగా రోడ్డుపై ఉన్న ఇతర కార్లను, ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మునుగోడు మండలం నల్లగొండ జిల్లా ఊకొండి గ్రామానికి చెందిన మల్లేష్ అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురు శశిప్రీతమ్ రెడ్డి,పవన్,జన్నారెడ్డి కి తీవ్రగాయాలయ్యాయని తెలిపారు. అతి వేగంగా వచ్చి ఇంతటి ఘోరానీకి కారణమైన కారు డ్రైవర్ డి. నందన్ ను పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement