Saturday, May 4, 2024

నర్సింగ్ విద్యార్థి అదృశ్యం..

హైదరాబాద్ : కాచిగూడలో నర్సింగ్‌ విద్యార్థిని అదృశ్యమైంది. యాదగిరిగుట్టకు చెందిన సీహెచ్‌ కోమలత(18) నాగోల్‌లోని కళాశాలలో నర్సింగ్‌ కోర్సు చదువుతోంది. ఈ నెల 14న నింబోలిఅడ్డలోని మేనత్త ఇంటికి వచ్చింది. కోమలత ఇంటికి వెళ్తున్నానని చెప్పి వెళ్లింది, కానీ ఇంటికి చేరలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వాకబుచేసినా ఆచూకీ లభించలేదు. తండ్రి యాదగిరి కాచిగూడ పీఎస్‌లో ఫిర్యాడు చేశాడని ఎస్ ఐ లక్ష్మయ్య తెలియజేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement