Saturday, May 4, 2024

ఎన్సిఎస్ గ్రూప్ ఫార్చ్యూన్ ప్రైమ్ స్పేస్, ఎన్సిఎస్ స్కైలైన్ హైరైస్ అపార్ట్ మెంట్ లోగో ప్రారంభం

ఎన్ సి ఎస్ గ్రూప్ ఆధ్వర్యంలో ఎన్ సి ఎస్ ఫార్చ్యూన్ ప్రైమ్ స్పేస్ అండ్ ఎన్ సి ఎస్ స్కైలైన్ హై రైస్ అపార్ట్ మెంట్ రెండు కొత్త ప్రాజక్ట్ లను హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, నేషనల్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్.కృష్ణయ్య కలిసి ప్రాజెక్ట్స్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సినీనటులు ప్రియాంక, సురభి, సాయి కృష్ణ మరికొంత మంది పాల్గొన్నారు. ఎన్ సి ఎస్ గ్రూప్ నిర్వహకులు మాట్లాడుతూ… ఎన్ సి ఎస్ గ్రూప్ ఇప్పుడు రెండు కొత్త ప్రాజెక్ట్స్ తో మీ ముందుకు వస్తుందన్నారు. ఎన్ సి ఎస్ ఫార్చ్యూన్ ప్రైమ్ స్పేస్ పేరుతో హైదరాబాద్ లోని షాదనగర్ దగ్గర బూర్గుల విలేజ్ లో 75 ఎకరాల్లో, ఎన్ సి ఎస్ స్కైలైన్ హై రైస్ అపార్ట్ మెంట్ పేరుతో విజయవాడ బందరు రోడ్ లోని ఇడుపుగళ్లులో మరో ప్రాజెక్ట్ ప్రారంభించారు. అంతే కాకుండా త‌మకు సినిమా పై ఉన్న ప్యాషన్ తోనే ఎన్ సి ఎస్ ఎంటరైన్ మెంట్ బ్యానర్ ని స్థాపించామని, త‌మ‌ బ్యానర్ లో మొట్టమొదటి సినిమా ఏమంటివి ఏమంటివి త్వరలో రాబోతుందని నిర్వాహకులు తెలిపారు. సంస్థ నిర్వాహకులు చంద్రశేఖర్, ఎం బి సత్య నారాయణ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, శేషు రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement