Saturday, May 18, 2024

జనాలపైకి కారుతో దూసుకెళ్లిన ఎమ్మెల్యే.. పట్టుకుని తుక్కు రేగ్గొట్టిన స్థానికులు

ఓ ఎమ్మెల్యే తన వాహనంతో బీభత్సం సృష్టించాడు. రద్దీగా ఉండే ఏరియాలో జనాలపైకి వాహనంతో దూసుకెళ్లడంతో డ్యూటీలో ఉన్న ఏడుగురు పోలీసులతో పాటు 23మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఒడిశాలోని బాన్పూర్ ఆఫీసు దగ్గర ఇవ్వాల (శనివారం) జరిగింది. అయితే.. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆ ఎమ్మెల్యే ప్రశాంత్ జగదేవ్ని పట్టుకుని స్థానికులు గుంపుగా చేరి ఇష్టమొచ్చినట్టు చితకబాదారు.

వారి దాడిలో తీవ్రంగా గాయపడిన ఎమ్మెల్యేను తంగి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం భువనేశ్వర్కు తీసుకెళ్లినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఎస్పీ అలేఖ చంద్ర తెలిపారు. అయితే.. గత ఏడాది అక్టోబర్‌లో బీజేపీ నాయకుడిపై దాడికి పాల్పడినందుకు జగదేవ్‌ను బిజూ జనతాదళ్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇదే ఘటనలో అతడిని అరెస్టు కూడా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement