హైదరాబాద్ : భారతదేశపు అతిపెద్ద మ్యూజిక్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్, ముజిగల్ తమ 8వ అత్యాధునిక సంగీత అకాడమీని హైదరాబాద్లోని బీరంగూడాలో ప్రారంభించింది. బీరంగూడా (హైదరాబాద్)లో ఉన్న అకాడమీ 1500 చ.అ విస్తీర్ణంలో సాటిలేని సౌకర్యాలు కలిగి ఉంది. ఇది గాత్రం, వాయిద్యంతో సహా సంగీతం నేర్చుకోవడానికి అత్యంత అనుకూలమైనది. ముఖ్య అతిథి అనన్య భాస్కర్ (భారతీయ నేపథ్య గాయని), గౌరవ అతిధులు – కాటా శ్రీనివాస్ గౌడ్ (పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి) అండ్ డా. లక్ష్మీనారాయణ ఏలూరి (వ్యవస్థాపకుడు-ముజిగల్) సమక్షంలో దీనిని ప్రారంభించారు. దాదాపు 500 మంది విద్యార్థులకు పలు బ్యాచ్లుగా బోధన చేసే సౌకర్యాలు కలిగిన బీరంగూడాలోని ఈ మ్యూజిక్ అకాడమీలో పియానో, కీబోర్డ్, గిటార్, డ్రమ్స్, కర్నాటిక్ వోకల్స్, హిందుస్తానీ వోకల్స్ , వెస్ట్రన్ వోకల్స్ లో బోధన చేస్తారు. ఈ మ్యూజిక్ అకాడమీ ప్రారంభం తరువాత, తొలి నెలరోజులూ ఉచితంగా సంగీత విద్యను చేరిన ప్రతి ఒక్కరికీ అందిస్తారు. ఆ తరువాత చేరిన ప్రతి ఒక్కరికీ ఒక నెల పూర్తి ఉచిత సంగీత విద్యను అందించనున్నారు.
ఈసందర్భంగా ముజిగల్ ఫౌండర్ డాక్టర్ లక్ష్మీనారాయణ ఏలూరి మాట్లాడుతూ… సంగీత విద్యను అందరికీ చేరువ చేయాలనే మహోన్నత లక్ష్యంతో ముజిగల్ అకాడమీ తీర్చిదిద్దామన్నారు. అభ్యాసకులకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కేంద్రాన్ని తమకు దగ్గరలో అందిస్తుందన్నారు. సంగీతంలో అత్యుత్తమ అభ్యాసం, బోధన అనుభవాలను ఈ కేంద్రం అందించనుందన్నారు. భారతీయ శాస్త్రీయ, పాశ్చాత్య సంగీతంలో విస్తృత శ్రేణి కోర్సులను ఇది అందిస్తుందన్నారు. ఈ కోర్సులను నిష్ణాతులైన సంగీత అధ్యాపకులు బోధించనున్నారు. వీటితో పాటుగా అభ్యాసకులను లక్ష్యంగా చేసుకుని ఓ నిర్మాణాత్మక కరిక్యులమ్ (బోధనాంశాలు), పీరియాడిక్ ఎస్సెస్మెంట్స్, సర్టిఫికేషన్, సౌకర్యవంతమైన ఫీజు చెల్లింపు ప్లాన్స్, సుశిక్షితులైన అధ్యాపకులను అందుబాటులో ఉంచామన్నారు. భారతదేశంతో పాటుగా యుఎస్ఏ, యుకె, ఆస్ట్రేలియా, యుఏఈలలో 10వేల మంది విద్యార్ధులకు 400కు పైగా సుశిక్షితులైన సంగీత టీచర్లు మద్దతు అందిస్తున్నారు. ఇప్పటికే 40వేల తరగతులు విజయవంతంగా పూర్తయ్యాయన్నారు.