Sunday, May 12, 2024

కరోనాతో గోల్కొండ ఎంఐఎం కార్పొరేట‌ర్ ఫ‌రీద్ ఖాన్ క‌న్నుమూత‌..

హైద‌రాబాద్ : గోల్కొండ ఎంఐఎం కార్పొరేట‌ర్ ఫ‌రీద్ ఖాన్ క‌రోనాతో నేడు మ‌ర‌ణించారు. 15 రోజుల క్రితం ఫ‌రీద్ ఖాన్ క‌రోనా బారిన ప‌డ్డారు. దీంతో ఆయ‌న ఆస్ప‌త్రిలో చికిత్స పొందారు. ఇటీవ‌లే నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో క‌రోనా నెగిటివ్‌గా నిర్ధార‌ణ కావ‌డంతో ఆస్ప‌త్రి నుంచి ఇంటికి వెళ్లారు. అయితే తిరిగి ఆయ‌న అనారోగ్యంతో ఆస్ప‌త్రిలో చేరారు. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఫ‌రీద్ ఖాన్ ఇవాళ మృతి చెందిన‌ట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు. ఫ‌రీద్ ఖాన్ మృతితో ఆయ‌న కుటుంబంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. ఖాన్ మృతిప‌ట్ల ఎంఐఎం నేత‌లు సంతాపం ప్ర‌క‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement