Thursday, May 16, 2024

మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య.. అనారోగ్య‌మే కార‌ణం!

కుత్భుల్లాపూర్ క్రైమ్ (ప్రభ న్యూస్) : హైద‌రాబాద్‌లోని దుండిగ‌ల్ ఏరియాలో ఓ వ్య‌క్తి మ‌న‌స్తాపంతో సూసైడ్ చేసుకున్నాడు. అనారోగ్యం కారణంగా ఆత్మహత్యకు పాల్ప‌డ్డ‌ట్టు తెలుస్తోంది. ఈ ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జ‌రిగింది. ఒడిశా రాష్ట్రం జరడా గ్రామానికి చెందిన పి.లక్ష్మీ నారాయణ రెడ్డి (42) బ‌తుకుదేరువు కోసం హైద‌రాబాద్ వచ్చాడు. వెల్డింగ్ పనిచేస్తూ బౌరంపేట ఇందిరమ్మ కాలనీలో కుటుంబంతో స‌హా ఉంటున్నాడు. 3 నెలల క్రితం గుండెజబ్బు రావడంతో పుట్టపర్తి జిల్లా సత్యసాయి ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించారు. అప్పటినుండి మనాసికంగా ఇబ్బందికి గుర‌య్యాడు.

ఈ మ‌ధ్య వారి సొంత ఊరులో జాతర జరగడంతో కుటుంబ సభ్యులు వెళ్లగా, అనారోగ్యం కారణంగా అతను వెళ్ల‌లేక‌పోయాడు. దీంతోపాటు మనాసిక వ్య‌ధ‌కు గురైన ఆయన ఈ నెల 20న ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని తమ్ముడు జనార్దన్ కౌశిక్ దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న‌ట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement