Tuesday, May 7, 2024

మల్లారెడ్డి ఇంజినీరింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి

కుత్బుల్లాపూర్, – మేడ్చల్ జిల్లా మైసమ్మగూడ మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో 4వ సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్ధిని చంద్రిక మంగళవారం ఉదయం కళాశాల ప్రాంగణం సమీపంలో అనుమాన‌స్పద స్థితిలో మృతి చెందింది.. అక్క‌డ మృత‌దేహాన్ని చూసిన స్థానిక ప్రజలు పెట్ బషీబాద్ పోలీసులకు విషయం తెలియజేశారు.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు.. పోస్ట్ మార్ట‌మ్ కోసం మృత‌దేహ‌న్ని హాస్ప‌ట‌ల్ కు త‌ర‌లించారు. మృతురాలు ఇంజినీరింగ్ కళాశాల పక్కనే ఉన్న కృప వసతి గృహంలో ఉంటూ మల్లారెడ్డి కళాశాలలో చదువుకుంటుంది.. మృతురాలు చంద్రిక స్వస్థలం మిర్యాలగూడ . కేసు నమోదు చేసుకున్న పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు.. పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీపీ రామలింగరాజు స్పష్టం చేశారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement