Monday, April 29, 2024

దేశంలో కరోనాతో 199 మంది మృతి …మరి రాష్ట్రంలో ?

భార‌త్‌లో క‌రోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మొన్నటి వరకు తగ్గిన కరోనా కేసులు ఇప్పుడు ఒక్కసారిగా ఎక్కువ అయ్యాయి. దీనితో ప్రజలంతా భయంతో వనికిపోతున్నారు. తాజాగా గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా 40,715 కరోనా కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు క చికిత్స పొందుతూ 199 మంది ప్రాణాలు విడిచారు.ఇక తాజాగా నమోదు అయిన కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసుల సంఖ్య 1,16,86,796కు చేరింది. ఇక మొత్తం మ‌ర‌ణాలు 1,60,166కు చేరుకున్నాయి. ప్ర‌స్తుతం దేశంలో 3,45,377 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

మరోవైపు తెలంగాణ‌లోనూ అదే జోష్ ను చూపిస్తుంది కరోనా మహమ్మారి. గ‌డిచిన 24 గంట‌ల్లో 68,171 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేయగా 412 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అలాగే క‌రోనా కార‌ణంగా ముగ్గురు మృతిచెందారు. దీంతో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 1674కి చేరగా గడిచిన 24 గంటల్లో 216 మంది కొలుకున్నారు. కాగా ప్ర‌స్తుతం రాష్ట్రంలో యాక్టివ్‌ గా 3,151 కేసులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement