Tuesday, May 7, 2024

Hyderabad: రాజేంద్రనగర్ లో బాలుడు అదృశ్యం!

హైదరాబాద్‌ నగరంలో బాలుడు అదృశ్యమైన ఘటన చోటుచేసుకుంది. నగర శివారు రాజేంద్రనగర్‌లోని బండ్లగూడలో రాత్రి చిట్టీ డబ్బులు ఇవ్వడానికి బయటకు వెళ్లిన 12ఏళ్ల సాయి చరణ్.. ఇంటికి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా.. ఎక్కడా ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబసభ్యులు రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించారు. బాలుడి కోసం రాత్రంతా గాలించిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. సాయిచరణ్ మైనర్ కావడంతో కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాజేంద్రనగర్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement