Friday, May 3, 2024

యువమోర్చా రాష్ట్ర లీగల్ సెల్ కన్వీన‌ర్ గా కేశవ్ యాదవ్ నియామకం….

సుభాష్ నగర్ – కుత్బుల్లాపూర్ నియోజక వర్గాన నికి చెందిన న్యాయవాది ఎమ్.కేశవ్ కేశవ్ యాదవ్ భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ గా నియమితులయ్యారు ఈ మేరకు బిజెవైఎమ్ పూర్తిస్థాయి కమిటీని నియమూస్తూ నాంపల్లి లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బిజెవైఎమ్ రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాష్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాపై నమ్మకం తో నాకు రాష్ట్రస్థాయి బాధ్యతను ఇచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ . ఆర్గనైజింగ్ సెక్రటరీ మంత్రి శ్రీనివాస్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు బాను ప్రకాష్ , జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి .సీనియర్ నాయకులు మల్లా రెడ్డి , బక్క శంకర్ రెడ్డి , నందనం దివాకర్ ల‌కు కృతజ్ఞతలు తెలిపారు. స్వయంసేవక్ కార్యకర్తగా అఖిలభారత విద్యార్థి పరిషత్ నాయకులు గా గ్రామ డివిజన్ అసెంబ్లీ స్థాయినాయకునిగా అంచలంచలుగా అవకాశం కల్పించిన పార్టీ ఈరోజు బీజేవైఎం రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ బాధ్యత లు అప్పగించడం సంతోషంగా ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement