Wednesday, May 15, 2024

బ‌ల్కంపేట ఎల్లమ్మ కల్యాణానికి మంత్రి అల్లోలకు ఆహ్వానం

జలై 5న‌ జరిగే బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణ మహోత్సవాలకు హాజరుకావాలని కోరుతూ శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థాన నిర్వాహకులు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డిని ఆహ్వానించారు. గురువారం గ‌చ్చిబౌలిలోని మంత్రి నివాసంలో ఆయ‌న‌ను కలిసి ఆహ్వాన ప‌త్రిక‌ను అందించారు. జలై 4న ఎదుర్కోళ్లు, 5న అమ్మవారి కల్యాణం, 6న రథోత్సవం జరుగ‌నున్నాయి. కార్యక్రమంలో ట్రస్టుబోర్డు చైర్మన్‌ సాయిబాబా, ఆలయ ఈవో అన్నపూర్ణ‌, అర్చకులు, తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement