Monday, April 29, 2024

HYD: మణికొండలో దావత్ ఎ ఈద్ మిలాప్.. పాల్గొన్న రంజిత్ రెడ్డి, క‌స్తూరి న‌రేంద‌ర్

మణికొండ, ఏప్రిల్ 16: పవిత్ర రంజాన్ మాసాన్ని అత్యంత నిష్ఠగా ఆచరించి.. ఈద్ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకొనే ముస్లిం సోదరులు.. ఆ తర్వాత నిర్వహించే కార్యక్రమమే దావత్-ఎ-ఈద్ మిలాప్. రంజాన్ ఉపవాసాల సందర్భంగా సాయం చేసినవారిని గుర్తుచేసుకుని మరీ వారిని విందుకు ఆహ్వానించడం దీని ఉద్దేశం.

కాగా, ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి మణికొండ మెహబూబ్ గార్డెన్ లో దావత్ ఎ ఈద్ మిలాప్ నిర్వహించారు. మునిసిపల్ చైర్మన్ కస్తూరి నరేందర్ ముదిరాజ్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దావత్ ఎ ఈద్ మిలాప్ అత్యంత వేడుకగా జరిగిందని మణికొండ మునిసిపల్ మైనారిటీలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement