Tuesday, April 30, 2024

అంత్యక్రియలకు హోప్ ఫౌండేషన్ రూ.10వేల సాయం

గుండెపోటుతో మృతిచెందిన మృతురాలి అంత్యక్రియల నిర్వహణ కోసం హోప్ ఫౌండేషన్ మృతురాలి కుటుంబానికి రూ.10వేలను అందజేయడం జరిగింది. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని శాంతినగర్ లో నివాసం ఉంటున్న వరుణ్ భార్య మానస (22) మంగళవారం గుండెపోటుతో మరణించింది. ఈ మేరకు మృతురాలి అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యుడు నక్కా నర్సింములుకు హోప్ ఫౌండేషన్ చైర్మెన్ కొండా విజయ్ కుమార్ రూ.10,000 లను అందజేయడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement