Wednesday, May 1, 2024

HYD: వరద ముంపు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ కమిషనర్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పర్యటన

హైదరాబాద్ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఈరోజు ఉదయం అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, ఉన్నతాధికారులతో కలిసి అంబర్ పేట నియోజకవర్గంలోని పలు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచనలు చేశారు.

అలాగే నల్లకుంట డివిజన్ రత్నానగర్ వద్ద నిర్మిస్తున్న రీటైనింగ్ వాల్ పనులను, అనంతరం అంబర్ పేట డివిజన్ పటేల్ నగర్ లో జరుగుతున్న SNDP నాలా పనులను కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ తో కలిసి పరిశీలించి, పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని నిర్ణీత గడువులోగా పనులను పూర్తీ చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ జియాఉద్దిన్, SNDP సీఈ కిషోర్, జోనల్ కమిషనర్ రవికిరణ్, డీఎంసీ మారుతి దివాకర్, AMHO జ్యోతి బాయి, సిసిపి రాజేంద్ర ప్రసాద్ నాయక్, ఇతర అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement