Thursday, May 9, 2024

Vikarabad: జడ్పీ ఇంచార్జ్ సీఈవోగా సుభాషిని

వికారాబాద్, జులై 28 (ప్రభ న్యూస్): వికారాబాద్ జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి జానకి రెడ్డి సెలవులో ఉన్న సందర్భంగా వికారాబాద్ జిల్లా పరిషత్ ఇన్చార్జి సీఈవో ఎన్.సుభాషిని బాధ్యతలు చేపట్టారు. నెలరోజులపాటు సీఈఓ జానకి రెడ్డి సెలవులో ఉన్న దరిమిలా ఎన్ సుభాషిని ఇన్చార్జి సీఈఓగా బాధ్యతలు చేపట్టారు.

ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలో సైతం సుభాషిని ఇన్చార్జి సీఈఓ గా బాధ్యతలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ సీఈవో సుభాషిని ప్రభన్యూస్ తో మాట్లాడుతూ… భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో జిల్లా పరిషత్ పరిధిలో గల గ్రామాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాల్సిందిగా ఆదేశించినట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement