Sunday, May 12, 2024

HYD: నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన గయాన్ సొల్యూషన్స్

హైదరాబాద్ : గయాన్ సొల్యూషన్స్, డీప్ టెక్నాలజీ ప్రొడక్ట్ ఇన్నోవేషన్ సంస్థ హైదరాబాద్‌లో తన కొత్త, విశాలమైన కార్యాలయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ముఖ్యఅతిధిగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన గయాన్ సొల్యూషన్స్‌ను ప్రశంసించారు. గయాన్‌ సొల్యూషన్స్ సంస్థ డైరెక్టర్ అశ్విని కోటారు ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈసందర్భంగా గయాన్ సొల్యూషన్స్ సీఈఓ చంద్ర కోటారు మాట్లాడుతూ.. భారత్‌లో తమ ఉనికి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కస్టమర్‌లకు మెరుగైన సేవలందించగలుగుతామన్నారు. తమ నూతన భారతదేశ కార్యాలయం ప్రపంచ స్థాయిలో సేవలను అందిస్తుందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా తమ వ్యాపారం మరింతగా పెరుగుతుందన్నారు.

భారతదేశంలో ప్రతిభావంతులైన యువతకు ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. జయేష్ రంజన్ సంచలనాత్మక మోబియస్ డిటాఎస్ (డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌గా) హైలైట్ చేసారు. మోబియస్ డి టా ఎస్ అనేది విప్లవాత్మకమైన సాస్ ఫ్యాక్టరీ తక్కువ-కోడ్ అండ్ ఏఐ సాంకేతికతలను ఉపయోగించడం ద్వారా అప్లికేషన్ అభివృద్ధి అన్నారు. ఈ కార్యక్రమంలో గయాన్స్ అనే అవార్డుల ప్రధానం చేశారు. ఉత్తమమైన సేవలందించిన టీమ్ సభ్యులను వారి అసాధారణ సహకారాలను గుర్తించి గయాన్ సొల్యూషన్స్ ఇంజినీరింగ్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ సబ్బుతో కలిసి జయేష్ రంజన్ ఆయా ఉద్యోగులను సత్కరించారు. గయాన్ సొల్యూషన్స్ ఇంజినీరింగ్ అండ్ డెవొప్స్ వైస్ ప్రెసిడెంట్ మేధమ్ష్ వుత్పాల మాట్లాడుతూ… ప్రైవేట్ రంగ వ్యవస్థాపకులు, సంస్థలు అప్లికేషన్ల సేవలను వేగంగా నిర్మించడానికి ప్రభుత్వ మౌలిక సదుపాయాలు అవసరమన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఓపెన్ డేటా విధానంతో హైదరాబాద్‌ను నిజంగా భాగ్యనగరంగా మార్చడానికి ఇది సరైన అడుగు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement