Tuesday, April 30, 2024

HYD: బోడుప్పల్ లో విద్యుత్ షాక్.. ఇద్దరికి తీవ్రగాయాలు

బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎన్టీఆర్ విగ్రహం సమీపంలో హిమ సాయి ఫ్యాబ్రికేషన్ పక్కన ది క్రిమి డిలైట్ షాప్ వద్ద వెల్డింగ్ పనులు నిర్వహిస్తుండగా పక్కనే ట్రాన్స్ ఫార్మర్ ఉండడం వల్ల వెల్డింగ్ పనులు చేస్తున్న ఇద్దరు వ్యక్తులకు విద్యుత్ షాక్ తగిలింది. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న సీనియర్ నాయకుడు కొత్త రవి గౌడ్, అంబేద్కర్ సంగం అధ్యక్షులు చిన్నంగల్ల కుమార్, సంఘటన స్థలాన్ని పరిశీలించారు. స్థానికులు అంబులెన్స్ కు కాల్ చేయగా విద్యుద్ఘాతానికి గురైన ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement