Sunday, May 19, 2024

కరోనా పాజిటివ్ వచ్చిందా ? అయితే మీ ఇంటికే భోజనం

హైదరాబాద్ లో కొత్త తరహా వ్యాపారానికి కొంత మంది అడుగులు వేస్తున్నారు. కరోనా వచ్చిన వారికి ఇది మరింత సౌకర్యవంతంగా మారనుంది. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి 14 రోజుల ప్యాకేజీ తో వెజ్, నాన్ వెజ్ తో రోజుకు రెండు పూటలు, లేదా మూడు పూటలా ఆహారాన్ని అందించే విధంగా కొన్ని సంస్థలు సిద్ధం అయ్యాయి.

వెజ్ రెండు పూటలకు కలిపి మనిషికి 3000 నుంచి 3500 రూపాయలు, అదే మూడుపూటలా అయితే 5500 నుంచి 6300 వరకు వసూలు చేయనున్నారు. అదే నాన్ వెజ్ రెండు పూటలకు అయితే 4400 నుంచి 5500 వరకు ఛార్జ్ చేయనున్నారు. ప్రస్తుతానికి ఈ సేవలు హైదరాబాద్ మహానగరం అంతటా లేవు. కాగా అమీర్ పెట్, మణికొండ, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లలో మాత్రమే అందుబాటులో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement