Wednesday, May 15, 2024

TS : పీర్జాదిగూడలో నిర్మాణాల కూల్చివేత

మేడిపల్లి, మార్చి 5 (ప్రభన్యూస్) : పీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని పర్వతాపూర్ సాయిప్రియా కాలనీ సర్వే నంబరు 10,11 సీలింగ్ స్థలంలో వెలసిన నివాసా సముదాయాలను మంగళవారం తెల్లవారుజామున రెవెన్యూ అధికారులు పోలీసుల పహారా లో జేసిబీతో నేలమట్టం చేశారు. అక్కడ మొత్తం స్థలం దాదాపు 15 ఎకరాలలో 300 వందలపైగా ప్లాట్లు ఉన్నాయి. అయితే కోర్టు పరిధిలో ఉన్న 70 ఇళ్లను అధికారులు ముట్టుకోలేదు. ఈ కూల్చివేతలలో జిల్లా ఉన్నతాధికారుల యాంత్రంగం,మండల తహసీల్దార్ బృందం, పోలీసులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement