Saturday, April 27, 2024

రెండో ఏడాది కూడా మోస్ట్ డిజైర్డ్ బ్రాండ్ గా ఆవిర్భవించిన డెల్ ల్యాప్ టాప్స్

భారతదేశంలో డెల్ ల్యాప్ టాప్స్ వరుసగా రెండో ఏడాది కూడా టీఆర్ఏ మోస్ట్ డిజైర్డ్ బ్రాండ్స్ 2022 రిపోర్ట్ లో మోస్ట్ డిజైర్డ్ బ్రాండ్ గా ఆవిర్భవించింది. ఈ రిపోర్ట్ ఈ సిరీస్ లో ఎనిమిదవది. వరుసగా రెండో ఏడాది కూడా తన ఎంఐ 2వ స్థానాన్ని నిలబెట్టుకోగలిగింది. ఈ నివేదిక ఆవిష్కరణ సందర్భంగా టీఆర్ఏ రీసెర్చ్ సీఈఓ ఎన్.చంద్రమౌళి మాట్లాడుతూ… కరోనా రెండేళ్ల కాలం ఎన్నో ఎగుడుదిగుళ్లను సృష్టించింద‌న్నారు. వినియోగ‌దారులు ప్రాథ‌మ్యాలు, దృక్ప‌థాల్లో గ‌ణ‌నీయ మార్పు చోటుచేసుకుంద‌న్నారు. వినియోగ‌దారుల‌ను క‌లిసి ప్ర‌యాణించేలా చేయ‌డంలో క‌న్జ్యూమ‌ర్ డిజైర్ అనేది అత్యంత ముఖ్య‌మైంద‌న్నారు.

వినియోగ‌దారుల హృద‌యాల్లో లోతుగా ఉన్న మాన‌సిక, సామాజిక‌, సాంస్కృతిక అంశాల‌ను అది వెలుగులోకి తీసుకువ‌స్తుంద‌న్నారు. వినియోగ‌దారుల కోరిక‌లు ఎంత ప్ర‌గాఢంగా ఉంటాయంటే.. సాధార‌ణంగా వాటిని మార్చుకోవ‌డం క‌ష్ట‌మ‌న్నారు. అయితే చాలా బ్రాండ్లు వినియోగ‌దారుల‌తో నూత‌న అనుబంధాల‌ను ఏర్ప‌రుచుకునేందుకు కోవిడ్ కాలాన్ని బాగా ఉప‌యోగించుకున్నాయ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement