Friday, May 3, 2024

HYD: తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే… కస్తూరి నరేందర్

తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రాజేంద్రనగర్ కాంగ్రెస్ అభ్యర్థి కస్తూరి నరేందర్ అన్నారు. బీఆర్ఎస్ మణికొండ మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రభావతి 100 మంది బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ఈరోజు కస్తూరి నరేందర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే, రాజేంద్ర నగర్ గడ్డపైన ఎగిరేది కాంగ్రెస్ పార్టీ జెండానే అని తెలియజేశారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో కాంతారావు, శివరామకృష్ణ సీతారామదాసు, దిలీప్, కృష్ణమోహన్, నిఖిల్ రాజ్, నాగేందర్, బీవీ రావు, భరత్, అభి, సరిత, దేవి, మంజుల, మహాలక్ష్మి, డాక్టర్ అశ్విన్, డాక్టర్ హేమంతరావు, డాక్టర్ చలపతి, డాక్టర్ లక్ష్మణ్ రాజ్, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement