Thursday, May 16, 2024

కాలేజ్ లు తెరిస్తే కఠిన చర్యలు..

హైదరాబాద్ : ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కాలేజ్ లను మూసి వేయాలని ఆదేశించారు ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్. ఇంటర్మీడియట్‌ కళాశాలలు తెరిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన‌ హెచ్చరించారు. విద్యార్థులకు ఆన్‌లైన్‌ బోధన కొనసాగించాలని సూచించారు. కళాశాలల యాజమాన్యాలు నిబంధనలు పాటించేలా జిల్లా ఇంటర్‌ విద్యా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మెడికల్‌ కళాశాలలు మినహా అన్ని కళాశాలలు, పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement