Friday, May 10, 2024

అనాథ‌ మృతదేహానికి మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ అంత్య‌క్రియ‌లు..

ప్రొద్దుటూరు, స్థానిక అమ్మ నాన్న వృద్ధాశ్రమంలో వృద్దురాలు నగరిగిరి రామలక్ష‌మ్మ నేడు మ‌ర‌ణించింది.. అయితే ఆమె అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించేందుకు ఆమె త‌రుపు బంధువుల ఎవ‌రు రాలేదు.. దీంతో ఆశ్రమ నిర్వాహకుడు పవన్ కుమార్ మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ వారిని సంప్రదించారు. స్పందించిన ఆ ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు, సి.ఈ.ఓ మల్లి కార్జున, శ్రీకాంత్, అనీఫ్, షాషావల్లి, యాసిన్, తదితరులు అక్క‌డికి చేరుకుని ఆ మృత‌దేహానికి స్మశాన వాటికలో హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement