Friday, May 3, 2024

HYD: జూబ్లీహిల్స్‌లోని ప్రోస్ట్‌లో బుష్‌మిల్స్‌తో కలిసి ప్రత్యేక పార్టీని నిర్వహించిన చైతన్య అక్కినేని

హైదరాబాద్ : చైతన్య అక్కినేని హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని ప్రోస్ట్‌లో ప్రత్యేక పార్టీకి హోస్ట్‌గా వ్యవహరించారు. బుష్‌మిల్స్ సహకారంతో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమం, బుష్‌మిల్స్ మహోన్నత వారసత్వం, ప్రఖ్యాత షోయు రూపొందించిన సున్నితమైన కలినరీ అనుభవంతో పాటు అసాధారణ వేడుకగా ఆవిష్కృతమైంది. సినీ పరిశ్రమలో ప్రముఖ వ్యక్తి అయిన చైతన్య అక్కినేని ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా ఉన్నారు.

బుష్‌మిల్స్ వారసత్వం, నైపుణ్యానికి తన ప్రశంసలను వ్యక్తం చేశారు. ఈ పార్టీకి కాంతి దత్, మీనాక్షి పమ్నాని, సుధా రెడ్డి, నమ్రతా సాధ్వానీ తదితరులు హాజరయ్యారు. ఈసంద‌ర్భంగా చైతన్య అక్కినేని మాట్లాడుతూ… బుష్‌మిల్స్, షోయుతో ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. హస్తకళ, సంప్రదాయం, జీవితంలోని అత్యుత్తమ విషయాలను పంచుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. మోనికా ఆల్కోబెవ్‌లో నేషనల్ సేల్స్ డైరెక్టర్‌గా హేమంగ్ చందత్ మాట్లాడుతూ… ఇది తమ బ్రాండ్‌ దృష్టి కేంద్రీకరించిన మార్కెట్ అన్నారు. ఈ డైనమిక్ సిటీలో అసాధారణమైన విస్కీ అనుభవాన్ని అందించాలనే తమ నిబద్ధతను ఈ పార్టీ పటిష్టం చేస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement