Monday, May 6, 2024

బీజేపీ నేతలది రెండు నాల్కల ధోరణి : బాల్క సుమన్

బీజేపీ నేతలది రెండు నాల్కల ధోరణి అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… వరి పండించాలని రైతులను బండి సంజయ్ రెచ్చగొట్టారన్నారు. మరి పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయడం లేదన్నారు. కేంద్రం తన బాధ్యతను విస్మరిస్తోందన్నారు. తెలంగాణ రైతులు, ప్రజలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అవహేళన చేశారన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు వారికి వత్తాసు పలుకుతున్నారన్నారు. వన్ నేషన్… వన్ ప్రొక్యూర్ మెంట్ పై ఎందుకు మాట్లాడరని అన్నారు. ధాన్యం సేకరణ కేంద్ర ప్రభుత్వ కనీస బాధ్యత అన్నారు. పంజాబ్ తరహాలో ధాన్యం కొనుగోలు చేయాలని.. లేదంటే బీజేపీ భరతం పడతామని బాల్క సుమన్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement