Sunday, May 12, 2024

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్ – గ్రేట‌ర్ లో 3కే ఫ్రీడమ్‌ రన్

‌హైదరాబాద్ – ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పీపుల్స్‌ ప్లాజా నుంచి 3కే ఫ్రీడమ్‌ రన్‌ నిర్వహించారు. ఈ 3కే రన్‌ను పీపుల్స్‌ ప్లాజా వద్ద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి జెండాఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డా.డీఎస్‌.లోకేశ్‌ కుమార్‌, క్రీడాశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, పలువురు సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు హాజరయ్యారు. ఈ రన్‌లో దాదాపు 3వేల మంది రన్నర్లు పాల్గొన్నారు. ఈ రన్‌లో పెద్ద ఎత్తున పాల్గొన్న క్రీడాకారులు, యువతీ యువకులు, ఉద్యోగులు, అధికారులు పాల్గొని పీపుల్స్‌ ప్లాజా, లుంబిని పార్క్‌, లక్‌డికాపూల్‌, కంట్రోల్‌ రూమ్‌ మీదుగా ఎల్బీ స్టే డియానికి చేరుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement