Sunday, April 28, 2024

Drivers: బస్సులలో ఆటో డ్రైవర్ల బిక్షాటన…

హైదరాబాద్ – బస్సుల్లో ఆటో డ్రైవర్ల భిక్షాటన చేస్తున్న ఘటన తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో తాము ఉపాధి కోల్పోయామని ఆటో డ్రైవర్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోజుకు రూ.100 కూడా సంపాదించలేక పోతున్నామని వాపోతున్నారు.

కుటుంబం గడవాలని ఆటోలు తీసుకుని బతుకుతున్న మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఫ్రీ బస్సు సర్వీసులు ఏర్పాటు చేసిందని అంటున్నారు. తమ ఆవేదనను ప్రభుత్వానికి చెప్పిన స్పందించలేదని వాపోతున్నారు. ఇళ్లు గడవాలంటే చాలా ఇబ్బందిగా మారిందని అందకే వినూత్నంగా భిక్షాటన చేస్తున్నామని చెబుతున్నారు. ఇప్పటికైనా ఆటోడ్రైవర్ల ఆవేదనను ప్రభుత్వం గుర్తించాలని కోరుతున్నారు.

ఒకవేళ ఆటోలు వేసిన అందులో ఒకరో ఇద్దరు ఎక్కడం వలను ఇబ్బందిగా తయారైందని వాపోతున్నారు. సంక్రాంతి పండుగ వస్తున్నా ఆటోవాలా ఇళ్లల్లో ఆనందం కరువైందని కన్నీరుమున్నీరవుతున్నారు. ఆటోవాలాల బాధలను ప్రభుత్వం గుర్తించి ఉపాధి కల్పించాలని కోరుతున్నారు. దీనికోసమే ఈ భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నామని ఆటోడ్రైవర్లు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement