Monday, April 29, 2024

KolKataత‌నిఖీల‌కు వ‌చ్చిన ఈడీ బృందాన్ని చిత‌క‌బాదిన గ్రామ‌స్తులు …

కోల్ క‌తా: పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ నేత షాజహాన్‌ షేక్‌ రహస్య స్థావరంపై త‌నిఖీల కోసం ఈడీ బృందానికి చేదు అనుభ‌వం ఎదురైంది. దాదాపు 250 నుంచి 300 మంది గ్రామస్తులు ఈడీ బృందంపై దాడి చేసి చిత‌క‌బాదారు. ఈ దాడిలో ఈడీ బృందం స‌భ్యులు ప‌లువురు గాయ‌పడ్డారు.

అంతే కాకుండా ఈడీ సిబ్బంది కార్ల అద్దాలను సైతం పగులగొట్టారు. వివ‌రాల‌లోకి వెళితే కేంద్ర బలగాలతో టీఎంసీ నేత షాజహాన్ షేక్ ఇంటికి ఈడీ చేరుకుని అతడి ఇంటి తాళం పగులగొట్టింది. విష‌యం తెలుసుకున్న గ్రామస్తులు గుమిగూడి ఈడీ బృందంపై దాడి చేశారు. ఆ ప్రాంతం నుంచి ఈడీ టీమ్ ను తరిమికొట్టారు. దీనిపై ఈడీ అధికారులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని కోరారు. అలాగే, ఈ దాడిని ప్రొత్సహించిన టీఎంసీ నేతలపై తగిన చర్యలు తీసుకుంటామని ఈడీ అధికారులు హెచ్చరించారు. ఈ ఘటనలో ఎవరైన ప్రమేయం ఉన్నా శిక్ష పడాల్సిందే అని అధికారులు డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement