Tuesday, May 14, 2024

SI పై బ్లేడ్తో దాడి..

నగరంలోని మారేడుపల్లి ఎస్ఐపై దుండగులు బ్లేడ్తో దాడికి పాల్పడ్డారు. ఎస్ఐ వినయ్పై బ్లేడ్తో ఇద్దరు దుండగులు దాడిచేశారు. మంగళవారం రాత్రి 2 గంటల సమయంలో మారేడుపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఎస్‌ఐ వినయ్‌ కుమార్‌ తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. నంబర్ ప్లేట్ లేని వాహనాన్ని ఎస్ఐ ఆపే ప్రయత్నం చేశారు. వాహనం ఆపుతుండగా ఎస్‌ఐపై బ్లేడ్తో దుండగుల దాడికి పాల్పడ్డారు. గాయపడిన ఎస్ఐని ఆస్పత్రికి తరలించారు. నిందితులు యాప్రాల్కు చెందిన టమాటా పవన్, సంజయ్గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం నార్త్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement