Friday, May 3, 2024

HYD: రాజ్ భవన్ ముట్టడికి బయల్దేరిన కాంగ్రెస్ నేతల అరెస్ట్

రాజ్ భవన్ ను ముట్టడించేందుకు బయల్దేరిన కాంగ్రెస్ నాయకులు పోలీసులు అరెస్ట్ చేశారు. రాజ్ భవన్ ను ముట్టడించాలని కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు నాయకులు బయల్దేరగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాట, ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో పోలీసులు కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో కాంగ్రెస్ నాయకులు అంజన్ కుమార్ యాదవ్, మహేష్ గౌడ్, అనిల్ యాదవ్ లు ఉన్నారు. వారిని నారాయణ గూడ పీఎస్ కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement