Friday, May 17, 2024

ప్రభుత్వ అసహనానికి అక్రమ అరెస్టులే ప్రత్యక్ష సాక్ష్యం : చంద్ర‌బాబు

ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతపై ప్రభుత్వం అసహనానికి లోనవుతుందని, ప్రభుత్వ అసహనానికి అక్రమ అరెస్టులే ప్రత్యక్ష సాక్ష్యమని మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు పేర్కొన్నారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పాలనపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందన్నారు. వైసీపీ నాయకులు చెబుతున్నట్లు కాలర్‌ ఎగరేసుకుని తిరగడం కాదు.. జనాలు కాలర్‌ పట్టే రోజు దగ్గర్లోనే ఉందని వ్యాఖ్యనించారు. విద్యాదీవేన రాలేదని ఎమ్మెల్యేను ప్రశ్నించిన పూతలపట్టులో ఇంజినీరింగ్ విద్యార్థి జశ్వంత్‌పై కేసు పెట్టడం ఎంతవరకు సమంజసమని ఆరోపించారు. విద్యార్థులపై కేసులు పెట్టి వారి జీవితాలను నాశనం చేస్తారా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం విద్యార్థికి క్షమాపణ చెప్పి అతడిపై కేసు ఎత్తేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement