Monday, April 29, 2024

గ్రీన్ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించిన యాంక‌ర్ జాను

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రశాసన్ నగర్ జీహెచ్ఎంసీ పార్క్ లో యాంకర్ జాను మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జాను మాట్లాడుతూ… గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామ్యమ‌య్యే అవకాశం కల్పించినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కి యాంకర్ జాను కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. అనంతరం జోర్డార్ సునీత, శ్రీముఖి, దీప్తి సునైన ముగ్గురికి గ్రీన్ఇండియా చాలెంజ్ విసిరిన జాను.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement