Monday, April 29, 2024

గ్రీన్ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించిన యాంక‌ర్ డాలి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్కు లో యాంకర్ డాలి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డాలి మాట్లాడుతూ… గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ త‌మ‌ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతి ఒక్కరిలో స్పూర్తిని నింపుతుందని, మొక్కలు నాటేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారన్నారు. అనంతరం తన స్నేహితులు వర్ష, కృష్ణారెడ్డి, విజే కరం ముగ్గురికి డాలి ఛాలెంజ్ విసిరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement