Sunday, May 5, 2024

ఎపి నుంచి తెలంగాణ ఉద్యోగులు రిలీవ్ – ఆదేశాలు జారీ

అమ‌రావ‌తి – రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కొంత మంది తెలంగాణ ఉద్యోగులు ఎపిలో ప‌ని చేస్తున్నారు.. వారిని తిరిగి తెలంగాణ‌కు పంప‌వ‌ల‌సిందిగా స్వ‌యంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసిఆర్ ఎపి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ను కోరారు.. దీనిపై స్పందించిన జ‌గ‌న్ ఎపిలో పని చేస్తున్న క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులు 711 మందిని రిలీవ్ జ‌గ‌న్ అధికారులను ఆదేశించారు.. దీంతో వారంద‌రిని రిలీవ్ చేస్తూ ప్ర‌భుత్వ ఆదేశాలు జారీ చేసింది.. రిలీవ్ అయిన ఉద్యోగులంతా ఏప్రిల్ ఒక‌టో తేది నుంచి తెలంగాణ ఉద్యోగులుగా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు.. ఇక్క‌డికి వ‌చ్చిన త‌ర్వాత వారికి పోస్టింగ్ లు ఇవ్వ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement