Thursday, April 25, 2024

రైళ్లలో రాత్రి నో ఛార్జింగ్

రైళ్ల‌లో అగ్ని ప్ర‌మాదాల నివార‌ణకు రైల్వేశాఖ చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇకపై రాత్రివేళ ప్రయాణికులు రైల్లోని ఛార్జింగ్ పాయింట్లను వినియోగించి తమ మొబైల్ ఫోన్ లేదా ల్యాప్ టాప్‌లను ఛార్జింగ్ చేసుకోలేరు. ఇటీవలి కాలంలో రైళ్లలో అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపధ్యంలో రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రైళ్లలోని ఛార్జింగ్ పాయింట్లను రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ బంద్ చేయనున్నారు. డెహ్రాడూన్ వెళ్లే శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లో ఇటీవల  షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం చోటుచేసుకుంది. ఇదేవిధంగా రాంచీలోను ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదాల నేపథ్యంలో రైల్వేశాఖ షార్ట్ సర్క్యూట్‌లను నివారించేందుకు ఇటువంటి నిర్ణయం తీసుకుంది. నిజానికి రాత్రిపూట ఛార్జింగ్‌కు వీల్లేకుండా చేయాలని 2014లోనే రైల్వే భద్రత కమిషనర్‌ ఆదేశించారని సంబంధిత అధికారి వెల్లడించారు. దానిపై రైల్వేబోర్డు తాజాగా అన్ని జోన్లకు మరోసారి ఆదేశాలు ఇచ్చిందని చెప్పారు. ఎలక్ట్రానిక్‌ పరికరాలను అవసరానికి మించి ఛార్జింగ్‌ చేస్తుండడం వల్ల అనేకసార్లు స్వల్పస్థాయిలోనైనా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement