Thursday, May 16, 2024

ఇక గృహ విద్యుత్‌పై కనీస ఛార్జీలు ఉండవు

ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) బుధవారం 2021–22 సంవత్సరానికి సంబంధించి కొత్త విద్యుత్‌ టారిఫ్‌ ప్రకటించింది. సగటు యూనిట్ ధరను రూ.7.17 నుంచి రూ.6.37కు తగ్గించింది. ఇకపై గృహ వినియోగదారుడిపై కనీస ఛార్జీలు ఉండవని, దాని స్థానంలో కిలో వాట్‌కు రూ.10 చెల్లిస్తే చాలని ఏపీఈఆర్‌సీ తెలిపింది. పవన, సౌర విద్యుత్ ఉత్పత్తికి పీపీఏ బదులుగా తాత్కాలిక టారిఫ్ వర్తింపజేస్తామని.. ఏప్రిల్ 1 నుంచి కొత్త టారిఫ్ అమల్లోకి వస్తుందని పేర్కొంది. అటు కులవృత్తుల వారికిచ్చే ఉచిత విద్యుత్‌ కొనసాగుతుందన్నారు. కులవృత్తులకు ఇచ్చే ఉచిత విద్యుత్‌ వల్ల రూ.1,657 కోట్ల భారం పడుతుందని, రైతుల ఉచిత విద్యుత్‌కు రూ.7,297 కోట్లు భరించేందుకు ప్రభుత్వం సమ్మతి తెలిపిందని పేర్కొన్నారు.

ఏపీఈఆర్‌సీ ప్రకటనలో ముఖ్యమైన పాయింట్లు:
✪ గృహ వినియోగదారుడికి ఇకపై కనీస ఛార్జీలు ఉండవు
✪ ఛార్జీల స్థానంలో కిలోవాట్‌కు రూ.10 చెల్లిస్తే చాలు
✪ చేనేత కార్మికులకు నెలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌
✪ యూనిట్‌ రూ.2.35 పైసలకే ఆక్వారైతులకు రాయితీపై విద్యుత్‌
✪ సబ్సిడీ విద్యుత్‌ కోసం ప్రభుత్వంపై రూ.9,091.36 కోట్లు భారం
✪ ఫంక్షన్‌హాళ్లకు కూడా ఇకపై నిర్ధిష్ట ఛార్జీలు ఉండవు
✪ పరిశ్రమల కేటగిరీలో ఆక్వా, పౌల్ట్రీ రంగాలను చేర్చాం
✪ గిరిజన తండాల్లో నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌
✪ రజక సంఘం నడుపుతున్న లాండరీలకు నెలకు 150 యూనిట్ల ఉచిత విద్యుత్‌
✪ బీపీఎల్‌ పరిధిలోని స్వర్ణకారులకు నెలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌
✪ బీపీఎల్‌లో ఉన్న ఎంబీసీ వర్గాలకు నెలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌
✪ నాయీ బ్రాహ్మణ వృత్తిదారులకు నెలకు 150 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement