Wednesday, May 8, 2024

జూలై 3న హైదరాబాద్‌లో ‘అదివారం అంగడి’ ఎక్స్‌పో..

పంజాగుట్టలోని ఎక్స్‌పో గ్యాలెరియాలో ఫ్లీ మార్కెట్ రెండవ సీజన్ ‘అదివారం అంగడి’ జూలై 3న మ‌ళ్లీ ప్రారంభంకానుంది. ఈ ఎక్స్‌పో ఇప్పుడు మొబ్బేరా ఫౌండేషన్ పాట్న‌ర్ షిప్ తో వ‌స్తుంది, అన్ని రకాల చిన్న స్థాయి స్టార్ట్అప్‌లకు సమగ్ర స్థలాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ సీజ‌న్ ప్రారంభం కానుంది. ఈ ఎక్స్‌పోలో సేంద్రీయ వస్తువుల నుండి చేనేత వస్త్రాలు, టెర్రకోట ఆభరణాలు, ఇండో-ఫ్యూజన్ దుస్తుల ఉత్పత్తులతో దాదాపు 40 మంది ఎగ్జిబిటర్ల పనిని ప్రదర్శిస్తారు. స్టాల్స్‌తో పాటు, ఈవెంట్‌లో రోజంతా తీరమ్ బ్యాండ్, ఎన్‌ఆర్‌బి బ్యాండ్ బస్కింగ్, మొబ్బెరా ఫౌండేషన్‌కు చెందిన అనేక మంది కళాకారుల ప్రత్యక్ష ప్రదర్శనలు చేయ‌నున్నారు.

ఉదయం 11 గంటల నుండి రాత్రి 9.30 గంటల వరకు ఓపెన్ లో ఉండే ఈ ఎక్స్‌పోలో బొగ్గు, కాలిగ్రఫీ, కుండల తయారీలో వర్క్‌షాప్‌లు కూడా ఉంటాయి. ఈ ఈవెంట్ లో ముఖ్య అతిథులుగా మొబ్బెర ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఉపాధ్యక్షులు అనిల్/సావిత్రి, కూచిపూడి నర్తకి-నటి మధురిమ నార్ల, దృశ్య కళాకారిణి, దర్శకుడు తరుణ్ భాస్కర్ తల్లి గీతా భాస్కర్, హైదరాబాద్‌కు చెందిన చిత్రకారుడు కంది నర్సింహులు తదితరులు ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement