Monday, May 6, 2024

125 కిలోల గంజాయి స్వాధీనం… నలుగురు అరెస్ట్

125 కిలోల గంజాయిని తరలిస్తున్న నలుగురిని అరెస్ట్ చేసి.. వారు తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్న ఘటన మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా ఉప్ప‌ల్ ప‌రిధిలోని మ‌ల్లాపూర్ చౌర‌స్తాలో చోటుచేసుకుంది. గంజాయిని మ‌హారాష్ట్ర‌కు త‌ర‌లించేందుకు య‌త్నించిన న‌లుగురు వ్య‌క్తుల‌ను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా స‌భ్యుల‌కు చెందిన కారులో నుంచి 125 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న‌ట్లు పోలీసులు నిర్ధారించారు. విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు పోలీసులు త‌నిఖీలు నిర్వ‌హించి, గంజాయి ర‌వాణాను అడ్డుకున్నారు.

కారులో ఉన్న 125 కిలోల గంజాయితో పాటు నాలుగు మొబైల్ ఫోన్లు, రూ. 92 వేల న‌గ‌దును స్వాధీనం చేసుకున్నారు. అయితే ఒడిశాకు చెందిన శంక‌ర్ బెహారా అర‌కులో 125 కిలోల గంజాయిని (కిలో గంజాయి రూ. 2000) కొనుగోలు చేశాడు. దీన్ని మిగ‌తా ముగ్గురికి రూ. 5 వేల చొప్పున కిలో గంజాయిని విక్ర‌యించేందుకు బేరం కుదుర్చుకున్నాడు. పుణెలో రూ.12 వేల చొప్పున కిలో గంజాయిని అమ్మేందుకు ప్లాన్ చేసిన‌ట్లు పోలీసులు తేల్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement