Sunday, May 5, 2024

సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు

హైదరాబాద్ : విద్యా రంగానికి మాత్రమే కాక విద్యార్ధుల సంక్షేమానికి సైతం పెద్ద పీట వేసిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు టీఆర్‌ఎస్‌వి సీనియర్‌ నాయకులు కిషోర్‌గౌడ్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విద్యారంగానికి అధిక ప్రాధాన్యమిస్తూ రూ.15,608 కోట్లు కేటాయించడం వలనే ఆయనకు విద్యారంగంపై ఉన్న మక్కువ అర్ధమవుతుందన్నారు. పాఠశాల విద్యకు, ఉన్నత విద్యకు, గురుకుల పాఠశాలల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కోసం కేటాయించిన ఈ బడ్జెట్‌ పేద విద్యార్ధులు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఎంతగానో దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement