Sunday, April 28, 2024

పుట్టిన రోజున మొక్క‌లు నాటిన క‌విత‌..

హైద‌రాబాద్ : ఎమ్మ‌ల్సీ క‌విత నేడు త‌న పుట్టిన రోజుని కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో నిరాడంబ‌రంగా జరుపుకున్నారు.. ఈ సంద‌ర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు క‌విత ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సతీమణి శోభ, ఎంపీ సంతోష్‌కుమార్‌తో క‌లిసి మొక్క‌లు నాటారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఈ పుట్టినరోజు రోజును ఎప్పటికీ మర్చిపోలేనిదన్నారు. అమ్మ , అన్నయ్య సంతోష్‌తో కలిసి మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. పుట్టిన‌రోజున మొక్క‌లు నాట‌డం ఎప్పటికీ మరిచిపొలేని మధుర జ్ఞాపకం అన్నారు. ఈ సంద‌ర్భంగా క‌విత సెల్పీ దిగారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement