Sunday, May 5, 2024

ఆస్తి వివాదంలో అన్న హ‌తం..

హైదరాబాద్‌: ఆస్తి వివాదంలో అన్నపై తమ్ముడు జ‌రిపిన దాడిలో అన్న మ‌ర‌ణించాడు.. ఈ ఘ‌ట‌న షేక్ పేట‌లో చోటు చేసుకుంది.. వివ‌రాల‌లోకి వెళితే ఆస్తి పంపకాల విషయంలో అన్నదమ్ములైన విజ‌య్ కుమార్, న‌రేంద‌ర్ ల‌ మధ్య మాటామాటా పెరిగింది. ఈ సంద‌ర్భంగా సహనం కోల్పోయిన తమ్ముడు నరేందర్ క‌ర్ర‌తో అన్న విజ‌య‌కుమార్ పై దాడి చేశాడు.. దీంతో అన్న స్పాట్ లోనే మ‌ర‌ణించాడు.. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు త‌మ్ముడిని అదుపులోకి తీసుకున్నారు..
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement