Saturday, May 4, 2024

కోకాపేట్ భూముల వేలంపై విచారణ… ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు

జీవో 111 పరిధిలోని కోకాపేట్ భూముల వేలంపై తెలంగాణ హైకోర్టులో  విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ, జస్టీస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ జరిపింది. కోకాపేట్ లేక్ నుండి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ftl బఫర్ జోన్ ఉందని పిటీషనర్ పేర్కొన్నారు. కోకాపేట్ కు 700 మీటర్ల దూరంలో ఉన్న భూములను ప్రభుత్వం ఏ విధంగా ఆక్షన్ చేసిందని ప్రశ్నించారు. వట్టి నాగుల పల్లిలో 111 జీవో ప్రకారం పిటీషనర్ భూములు FTL జోన్ లో ఉన్నాయని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు. దీంతో హైపవర్ కమిటీ రీఫరెన్స్లని ఎందుకు ఇప్పటి వరకు అమలు చేయడం లేదని హైకోర్టు అడిగింది. ప్రభుత్వం నియమించిన ఈపిటిఆర్ఐ రీఫరెన్స్ ని ఎందుకు హై పవర్ కమిటీకి పంపలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

ప్రభుత్వం వేలం వేసిన భూములలో వచ్చినటువంటి సొమ్మును ESCROW ఖాతాలో ఉంచాలన్న హైకోర్టు.. వేలం వేసిన భూముల్లో మౌలిక సదుపాయాలు పూర్తిగా సమకూర్చిన తర్వాతనే ఆ డబ్బులను ప్రభుత్వం ఖాతా నుండి తీసుకోవాలని ఆదేశించింది. అప్పటి వరకు ఆ డబ్బులన్ని ESCROW అకౌంట్ లోనే ఉంచాలని సూచించింది. ప్రభుత్వం కోరిన ఈపిటిఆర్ఐ రిపోర్ట్ లోని రిఫరెన్స్ ని ఎందుకు హైపవర్ కమిటీ ఇవ్వలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వం భూమి 948 ఎకరాలు 377 పార్ట్స్ లో ఉందని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. జీవో 111ను ఎత్తి వేస్తున్నారని ముఖ్యమంత్రే స్వయంగా మీడియా ముందు చెప్పిన విషయం అవాస్తవమని ప్రభుత్వం తెలిపింది. నాలుగేళ్లు దాటినా హైపవర్ కమిటీ ఇప్పటివరకు ఎందుకు సమావేశం కాలేదని హైకోర్టు ప్రశ్నిచింది. హైపవర్ కమిటీ రిఫరెన్సు ని ఎందుకు మీరు అమలు చేయలేదని నిలదీసింది. హెచ్ఎండిఎ, ఏపీటిఆర్ఐని నివేదికను కోరిన ప్రభుత్వం… ఎందుకు దాన్ని అమలు చేయటం లేదని అడిగింది. రేపు పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి అదేశించిన హైకోర్టు… తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

ఈ వార్త కూడా చదవండిః సైబరాబాద్ సీపీ సజ్జనార్ బదిలీ.. కొత్త పోలీస్ కమిషనర్ ఎవరంటే..

Advertisement

తాజా వార్తలు

Advertisement