Friday, April 26, 2024

మళ్లీ తెరపైకి టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. ప్రముఖ హీరో, హీరోయిన్‌లకు ఈడీ నోటీసులు

గతంలో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. దీనిలో భాగంగా విచారణకు హాజరుకావాలని పలువురు సినీ తారలకు ఈడీ సమన్లు జారీ చేసింది. వీరిలో అగ్ర హీరోలు, హీరోయిన్లు, దర్శకులు సహా 10 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ జాబితాలోఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్, రానా, రవితేజ, తరుణ్, పూరీ జగన్నాథ్, నవదీప్, మొమైత్ ఖాన్, నందు, శ్రీనివాస్ ఉన్నట్లు సమాచారం. వీరికి ఈడీ నోటీసులు పంపినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా చాలా రోజుల తర్వాత ఈడీ ఈ కేసులో రంగంలోకి దిగడంతో తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది. అయితే కొందరు ఈ కేసు మూణ్నాళ్ల ముచ్చటే అని సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement