Sunday, May 5, 2024

సిద్ధిపేట జిల్లాలో గన్ మిస్ ఫైర్.. ఒకరు మృతి

సిద్ధిపేట జిల్లా మద్దూర్ మండలంలో గన్​ ఫైర్​ జరిగింది. ఈ మిస్ ఫైర్ లో హైదరాబాద్‌కు చెందిన యువకుడు చనిపోయాడు. సలాక్‌ పూర్‌ గ్రామంలో ఫజిల్ అనే వ్యక్తి కొత్త ఇళ్లు కొన్నాడు. ఫజిల్ మేనల్లుడు హైదరాబాద్‌ లంగర్ హౌస్‌లో నివాసం ఉంటున్నాడు.

అయితే ఫజిల్ మేనల్లుడు, 8 మంది స్నేహితులతో కలిసి సలాక్‌పూర్ గ్రామనికి వచ్చారు. బుధవారం రాత్రి విందు చేసుకునే క్రమంలో గన్‌తో ఫైర్ చేయడంతో అది మిస్ ఫైర్ అయి ముసాఫ్ తలకు బలంగా తగిలింది. వెంటనే సలాక్‌పూర్ నుంచి సిద్ధిపేటకు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే ముసాఫ్ చనిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement